చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మున్సిపల్ పరిధిలోని రెండో వార్డుకు చెందిన ఎస్కే కాసిం అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ జెడ్పిటిసి మరియు ఒకటో వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రావుల వెంకన్న, ఆగు అశోక్ యాదవ్, ఎస్కే అసిముద్దీన్, గోకర సారంగం తదితరులు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. కష్ట సమయంలో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన శేపూరి రవీందర్ సేవలను స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి