Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:34 AM

మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి

మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి

మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి
January 18, 2026 06:48 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్.

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

మూసీ జల కాలుష్యంను అరికట్టి మూసీ ఆయకట్టు ప్రాంతాన్నికి ప్రత్యామ్నాయంగా గోదావరి, కృష్ణ జలాలు అందించి కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆదివారం పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి సిపిఎం గ్రామ శాఖ సమావేశం పార్టీ కార్యాలయంలో జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని మూసీ విషపు నీరు కమ్మేసిందని, ఏళ్ల తరబడి గత్యంతరం లేక ప్రజలు ఈ నీటిని వాడుతూ పంటలు పండిస్తున్నారని దానితో బువ్వ పెట్టే భూమే విషయమౌతుందని ఆవేదన చెందారు. మరో వైపు ప్రజారోగ్యము, పశు, మత్స్య సంపద, జీవజాలం యొక్క మనగడు ప్రశ్నార్ధంగా మారిందని తెలిపారు. మూసీ నీళ్లు కాలుష్యంతో అనేక రకాలైన జబ్బులు, చర్మవ్యాధులు, క్యాన్సర్ లాంటి రకరకాల రోగాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. 40 ఏళ్ల క్రితం తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ నది ఇప్పుడెందుకు మురికి కోపంగా మారిందో పాలకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ? మూసీ పరివాహక ప్రాంతం వెంట 12 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయని ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం, వ్యర్దపదార్థాలతో మూసీ కాలువ మురికి కూపంగా, డంపింగ్ యార్డ్ గా మార్చారని దీనిని నివారించవలసిన పాలకులు ఓట్ల రాజకీయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మూసీ ప్రక్షాళనలకు, కాలుష్య నివారణకు తగు చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయంగా గోదావరి, కృష్ణ జలాలను అందించాలని నర్సింహ డిమాండ్ చేసినారు. ఈ సమావేశానికి పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా ఇంకా సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, శాఖ కార్యదర్శి పత్తి బిక్షపతి, గ్రామ నాయకులు అందెల యాదగిరి, అశోక్, బాత్క బిక్షపతి, కంజర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News