Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:37 AM

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
07-02-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేపురి జయమ్మకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఉదయం నుంచే వార్డు పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఇంటింటా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరించారు. స్థానిక సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన చిరుమర్తి లింగయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజల స్పందన ఉత్సాహంగా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేతలు ప్రజలను కోరారు.


Sthanikam

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేపురి జయమ్మకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఉదయం నుంచే వార్డు పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఇంటింటా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరించారు. స్థానిక సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన చిరుమర్తి లింగయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజల స్పందన ఉత్సాహంగా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేతలు ప్రజలను కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News