మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేపురి జయమ్మకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఉదయం నుంచే వార్డు పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఇంటింటా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరించారు. స్థానిక సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన చిరుమర్తి లింగయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజల స్పందన ఉత్సాహంగా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేతలు ప్రజలను కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి