Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 10:58 PM

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం-వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం-వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం-వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్
March 11, 2026 09:39 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

ఉమెన్స్ ఫర్ ట్రీ’తో పచ్చదనం వైపు అడుగులు

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా అమృత్ మిత్ర పథకం కింద నిర్వహిస్తున్న ‘ఉమెన్స్ ఫర్ ట్రీ’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు.మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ హన్ను మహమ్మద్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్, చింతల సాయిలు, కొమ్ము లక్ష్మయ్య, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, దీప, హనుమాన్ ప్రసాద్ (సానిటరీ ఇన్‌స్పెక్టర్), మెప్మా టీఎంసీ కవిత, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్లు నరసింహ, అంజయ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News