Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

మోడీ–ట్రాంపు చీకటి వాణిజ్య ఒప్పందం అనైతికం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

మోడీ–ట్రాంపు చీకటి వాణిజ్య ఒప్పందం అనైతికం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

మోడీ–ట్రాంపు చీకటి వాణిజ్య ఒప్పందం అనైతికం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి
February 10, 2026 05:59 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత వ్యవసాయ రంగాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం

సిపిఎం ఆధ్వర్యంలో నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

రామన్నపేట,

అమెరికాతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం ట్రాంపుకు తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య తీవ్రంగా విమర్శించారు.సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ స్థానిక సుభాష్ సెంటర్ వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడంతో సోయాబీన్, మొక్కజొన్న రైతులకు గడ్డు రోజులు తప్పవని అన్నారు.

ఐదు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం పేరిట దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని, తక్కువ ధరలకు చమురు ఇస్తున్న దేశాల నుంచి కొనుగోళ్లను ఆపివేయడం దుర్మార్గమని విమర్శించారు. దేశంలోకి వచ్చే విదేశీ వస్తువులపై సుంకాలు తగ్గించడం వల్ల భారత రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి దేశ ప్రజలను మోసం చేస్తోందని, ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. స్వదేశీ నినాదాలు చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వం విదేశీ శక్తులకు మోకరిస్తోందని, దీనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్, నీల అయిలయ్య, ఆవనగంటి నగేష్, గంటెపాక శివకుమార్, మునికుంట్ల లెనిన్, శానగొండ రాము, బడుగు రమేష్, అంబటి సురేందర్ రెడ్డి, నకిరేకంటి సురేష్, గాదె కృష్ణ, తుర్కపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News