విజయవాడ పార్లమెంట్ అనుబంధ కమిటీలపై చర్చ
మంగళగిరి: కేంద్ర కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ అనుబంధ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కీలక సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. జిల్లా అధ్యక్షురాలు మరియు విజయవాడ పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తిరువూరు శాసనసభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అనుబంధ కమిటీల రూపకల్పన, వాటి బాధ్యతలు, కార్యకలాపాల ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. అలాగే తిరువూరు నియోజకవర్గ స్థాయిలో కమిటీల బలోపేతంపై ఎమ్మెల్యే అభిప్రాయాలు వెల్లడించారు.
సంస్థాగత బలోపేతం, కేడర్ చైతన్యం, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే దిశగా నాయకులు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి , విజయవాడ తూర్పు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి