PRINT TIME: May 26, 2026 06:33 PM
మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు
మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు
February 15, 2026 02:30 AM
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి నుండి గత డిసెంబర్ 19న చిట్యాల మండలం గుండ్రాంపల్లి వెళ్తూ అదృశ్యమైన నందగిరి రాములమ్మ (81) మృతదేహాన్ని ఇవాళ గుండ్రాంపల్లి చెరువులో గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేక ప్రమాదవశాత్తు ఆమె నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గొర్ల కాపరి ఇచ్చిన సమాచారంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. ఐతే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో గత డిసెంబర్ 22న కేసు నమోదయింది. ఆ కేసు ఆధారంగా కుటుంబ సభ్యులను పిలిపించి రాములమ్మ శవంగా గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి