PRINT TIME: May 26, 2026 03:05 PM
మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం
మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం
May 18, 2026 10:02 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
మిర్యాలగూడలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ నెల 11న ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా, గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లు బైక్పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లాడు. బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వారం రోజుల పాటు సీసీ కెమెరాలు, వివిధ వాహనాల వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, ఒక బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం మండలం, మార్కాపురం జిల్లా ముడివేముల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి