Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
April 07, 2026 08:48 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వినియోగదారుల ఫిర్యాదులపై అధికారుల దృష్టి

నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి పట్టణంలో ఉన్న ఓ మీసేవ కేంద్రంపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఈ దాడుల్లో భాగంగా నల్గొండ కలెక్టరేట్‌కు చెందిన దుర్గారావు ఈడీఎం, నార్కెట్‌పల్లి తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వర్ రావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.వి. తరుణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. మీసేవ కేంద్రంలో సేవలు పొందుతున్న ప్రజల నుండి ప్రత్యక్షంగా వివరాలు సేకరించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించి విచారణ జరిపారు.తనిఖీల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులకు అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఫిర్యాదుదారులు, వినియోగదారులు మరియు కేంద్ర సిబ్బంది నుండి సేకరించిన సమాచారంతో సమగ్ర నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇకపై మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. ఎక్కడైనా అధిక వసూళ్లు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నార్కెట్‌పల్లి పట్టణంలోని "నాని నెట్ సెంటర్" పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్వాహకురాలు శోభా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై తదుపరి చర్యలపై అధికారుల నివేదిక అనంతరం స్పష్టత రానుంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News