PRINT TIME: July 11, 2026 06:09 AM
మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ
మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ
May 23, 2026 08:06 PM
457 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సామరస్య వాతావరణంలో ముందుకు సాగుదాం : మీనాక్షి నాయుడు
: ఆదోని నియోజకవర్గంలో వీఆర్వో బీటీ సురేష్, పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మధ్య నెలకొన్న వివాదానికి శనివారం మీనాక్షి నాయుడు సమక్షంలో తెరపడింది.
ఇరువర్గాల పెద్దలను కలిసి కూర్చోబెట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మీనాక్షి నాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరువర్గాల పెద్దలు ఇటీవల జరిగిన సంఘటనను పరస్పర అవగాహనతో పరిష్కరించుకున్నారు.
ఇరు కులాలకు చెందిన నాయకులు కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి ముందుకు సాగుతూ సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి, కురుబ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి