Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 11:06 PM

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
April 01, 2026 08:45 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News