Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
April 01, 2026 08:45 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News