మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
Krishna
నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి