Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:49 PM

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
February 07, 2026 09:35 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వెయ్యండి...

నీలం మధు ముదిరాజ్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

శుక్రవారం జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట, జిన్నారం, మంగంపేట్, ఊట్ల, నల్తూర్ గ్రామాల పరిధిలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమానికి కృషి చేస్తుందని కొనియాడారు.మహా లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం

తో పాటు పేదలకు గృహ లక్ష్మీ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికలు పూర్తికాగానే ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అభ్యర్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News