Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
February 07, 2026 09:35 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వెయ్యండి...

నీలం మధు ముదిరాజ్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

శుక్రవారం జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట, జిన్నారం, మంగంపేట్, ఊట్ల, నల్తూర్ గ్రామాల పరిధిలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమానికి కృషి చేస్తుందని కొనియాడారు.మహా లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం

తో పాటు పేదలకు గృహ లక్ష్మీ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికలు పూర్తికాగానే ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అభ్యర్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News