మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి
మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి
Biksham Goud
తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి శిబిర కార్యాలయ ఇన్చార్జ్ తుంబురూ దయాకర్ రెడ్డి హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తోడ్పడుతోందని తెలిపారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఉన్నాం రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, సంగబత్తుల సుమన్ రెడ్డి, కొక్కిరేణి సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్, గుగ్గిల అంబేద్కర్, మోర విజయపాల్ రెడ్డి, సిరిగద్దే ఉపేందర్, వరిగడ్డి సాగర్, సోమనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి