Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి

మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి

మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి
February 23, 2026 04:41 PM 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి శిబిర కార్యాలయ ఇన్చార్జ్ తుంబురూ దయాకర్ రెడ్డి హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తోడ్పడుతోందని తెలిపారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఉన్నాం రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, సంగబత్తుల సుమన్ రెడ్డి, కొక్కిరేణి సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్, గుగ్గిల అంబేద్కర్, మోర విజయపాల్ రెడ్డి, సిరిగద్దే ఉపేందర్, వరిగడ్డి సాగర్, సోమనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News