మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ
మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ
Editor Desk
భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం భువనగిరి పట్టణంలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జెండా శాఖ కార్యదర్శి బండి రవి సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాయ కృష్ణ హాజరయ్యారు. అనంతరం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికులపై భారం పెరిగి నిరుద్యోగం తీవ్రతరమవుతోందని అన్నారు.
కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, దండు గిరి, బండి రవి, గుండెబోయిన కృష్ణ, చింతల శివ, కొత్త లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి