Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:16 AM

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ
02-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శనివారం భువనగిరి పట్టణంలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జెండా శాఖ కార్యదర్శి బండి రవి సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాయ కృష్ణ హాజరయ్యారు. అనంతరం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికులపై భారం పెరిగి నిరుద్యోగం తీవ్రతరమవుతోందని అన్నారు.

కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, దండు గిరి, బండి రవి, గుండెబోయిన కృష్ణ, చింతల శివ, కొత్త లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ

Article Image

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శనివారం భువనగిరి పట్టణంలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జెండా శాఖ కార్యదర్శి బండి రవి సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాయ కృష్ణ హాజరయ్యారు. అనంతరం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికులపై భారం పెరిగి నిరుద్యోగం తీవ్రతరమవుతోందని అన్నారు.

కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, దండు గిరి, బండి రవి, గుండెబోయిన కృష్ణ, చింతల శివ, కొత్త లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News