Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి
January 02, 2026 08:44 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటకు న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం : కాంగ్రెస్ నేతల పిలుపు

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేటకు న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ముందస్తు వ్యూహాలతో పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సూర్యాపేటలో ఈ సన్నాహక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ ఓటర్ జాబితా ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఆయా వార్డుల నాయకులు అధికారులతో సమన్వయం చేసుకొని ఓటరు జాబితాలోని సందేహాలు, లోపాలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి నాయకుడు వార్డులోనే ఉండి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవాలని, వ్యూహరచనలో వెనుకబడొద్దని స్పష్టం చేశారు.

ఈ నెల 5వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ వరకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఇతర వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ వార్డుల నుంచీ, అలాగే భార్య లేదా తల్లి పేరుతో పోటీ చేయాలనుకున్నా వారి పేర్లతో కూడా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48 వార్డులకు 500కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం నాలుగు వార్డులకు ఒక సీనియర్ నాయకులతో కూడిన అబ్జర్వర్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ వార్డుల వారీగా విచారణలు, సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తుందని పేర్కొన్నారు.

టికెట్ రాని వారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పదేళ్లపాటు కొనసాగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కోసం సూర్యాపేటకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో వార్డుల వారీ అభివృద్ధి అంశాలను చేర్చేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వార్డుల స్థాయిలో ఎలాంటి చిన్న పొరపాట్లు జరిగినా అవి పార్టీకి, ఎన్నికల ఫలితాలకు నష్టం చేకూరుస్తాయని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణాభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ కలసి కట్టుగా పని చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News