Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం
December 27, 2025 06:59 PM 652 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి

స్థానికం ప్రతినిధి

మునిపంపుల: గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం గత కాలంలో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామంలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు.

తుమ్మ బావి గూడెంలో దళితరత్న యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నూతన పాలకవర్గ సభ్యులైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కట్ట ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశం, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, పదవ వార్డు సభ్యులు కట్ట అరుణ్ కుమార్‌కు సన్మానం జరిగింది.

సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం నిత్య ప్రయత్నాలు చేస్తానని, ఎలాంటి సమస్య ఉన్నా పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు ప్రజల సహకారం అవసరం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళితరత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ కార్యదర్శి నీరుడు అంజన్ కుమార్, యువ సభ్యులు బుంగ దేవదానం, పెరుమాండ్ల యాదయ్య, పట్టేటి శేఖర్, బందెల బిక్షం, పట్టేటి నర్సయ్య, అప్పం సురేందర్, బాదె విజయ్, బందెల శ్రీను, సాతిరి వెంకన్న, బందెల నరసయ్య, బుంగ సతీష్, బుంగ వెంకటేష్, బుంగ ప్రవీణ్, పట్టేటి రాజేష్, బండ్ల దయాకర్, పట్టేటి యాదయ్య, కట్ట మధు, అభిరుప్ అలెగ్జాండర్, డా. బందెల సంతోష్, డా. బందెల రాణి, బండ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News