Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:49 AM

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి, నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానం
December 27, 2025 06:59 PM 638 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కృషి

స్థానికం ప్రతినిధి

మునిపంపుల: గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం గత కాలంలో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామంలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు.

తుమ్మ బావి గూడెంలో దళితరత్న యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నూతన పాలకవర్గ సభ్యులైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కట్ట ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశం, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, పదవ వార్డు సభ్యులు కట్ట అరుణ్ కుమార్‌కు సన్మానం జరిగింది.

సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం నిత్య ప్రయత్నాలు చేస్తానని, ఎలాంటి సమస్య ఉన్నా పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు ప్రజల సహకారం అవసరం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళితరత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ కార్యదర్శి నీరుడు అంజన్ కుమార్, యువ సభ్యులు బుంగ దేవదానం, పెరుమాండ్ల యాదయ్య, పట్టేటి శేఖర్, బందెల బిక్షం, పట్టేటి నర్సయ్య, అప్పం సురేందర్, బాదె విజయ్, బందెల శ్రీను, సాతిరి వెంకన్న, బందెల నరసయ్య, బుంగ సతీష్, బుంగ వెంకటేష్, బుంగ ప్రవీణ్, పట్టేటి రాజేష్, బండ్ల దయాకర్, పట్టేటి యాదయ్య, కట్ట మధు, అభిరుప్ అలెగ్జాండర్, డా. బందెల సంతోష్, డా. బందెల రాణి, బండ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News