Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ
December 28, 2025 02:01 PM 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

మునిపంపుల బోటి మీదిగూడెంలో నిర్వహణ

మునిపంపుల బోటి మీదిగూడెం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలకలపల్లి గిరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ—నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రపంచంలోనే భారత్‌ను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్‌తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు యాదాసు లక్ష్మణ్ కుమార్, డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, గుండాల అంజయ్య, శుభకోటి శశి కృష్ణమాచారి, కర్నాటి నరేష్ నేత, తెలకలపల్లి పెద్ద బిక్షం, మామిండ్ల కృష్ణ, ఆదొండ హరినాథ్, బూడిద ఉదయ్ కుమార్, పున్న శ్రీకాంత్, మామిళ్ళ రామ్ నరేందర్, సూరపల్లి నరేష్, కొమిరి తిరుమల్, ఆదొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం గ్రామస్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచే దిశగా ఇది దోహదపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News