మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ
మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ
Editor Desk
మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు
రామన్నపేట స్థానికం ప్రతినిధి
మునిపంపుల బోటి మీదిగూడెంలో నిర్వహణ
మునిపంపుల బోటి మీదిగూడెం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలకలపల్లి గిరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ—నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రపంచంలోనే భారత్ను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు యాదాసు లక్ష్మణ్ కుమార్, డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, గుండాల అంజయ్య, శుభకోటి శశి కృష్ణమాచారి, కర్నాటి నరేష్ నేత, తెలకలపల్లి పెద్ద బిక్షం, మామిండ్ల కృష్ణ, ఆదొండ హరినాథ్, బూడిద ఉదయ్ కుమార్, పున్న శ్రీకాంత్, మామిళ్ళ రామ్ నరేందర్, సూరపల్లి నరేష్, కొమిరి తిరుమల్, ఆదొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం గ్రామస్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచే దిశగా ఇది దోహదపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి