Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
December 24, 2025 07:29 PM 219 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లైట్లు విరాళంగా ఇచ్చిన డా. తత్తరి సాయి బాబు


దాతల సహకారం మరువలేనిది:

(మునిపంపుల, స్థానికం న్యూస్ - డిసెంబర్ 24): గ్రామాభివృద్ధిలో ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా భాగస్వామ్యం కావాలని, సమస్యల పరిష్కారానికి తమ వంతు తోడ్పాటును అందించాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.

బుధవారం మునిపంపుల గ్రామ పరిధిలోని తుమ్మబావిగూడెంలో డాక్టర్ తత్తరి సాయిబాబు ఆర్థిక సహకారంతో సమకూర్చిన 25 ఎల్ఈడీ (LED) వీధి లైట్లను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో విద్యుత్ స్తంభాలకు అమర్చారు.

సమస్య పరిష్కారానికి తక్షణ స్పందన: ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ.. తుమ్మబావిగూడెంలో గత కొంతకాలంగా వీధి లైట్లు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ తత్తరి సాయిబాబు సామాజిక బాధ్యతతో, స్వచ్ఛందంగా ముందుకొచ్చి లైట్లను బహూకరించడం

అభినందనీయమన్నారు. ప్రజల సౌకర్యార్థం లైట్లను అందజేసిన సాయిబాబుకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని ఇతర అవసరాలకు కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు.

పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు కట్ట అరుణ్ కుమార్, పట్టేటి నర్సింహా, అప్పం సురేందర్, గంటెపాక శివ కుమార్, బుంగ ప్రవీణ్, రావుల సైదులు, బండ్ల దయాకర్, గంటెపాక సాయి కుమార్, కట్ట శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News