మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
మునిపంపుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
స్థానికం బృందం
లైట్లు విరాళంగా ఇచ్చిన డా. తత్తరి సాయి బాబు
దాతల సహకారం మరువలేనిది:
(మునిపంపుల, స్థానికం న్యూస్ - డిసెంబర్ 24): గ్రామాభివృద్ధిలో ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా భాగస్వామ్యం కావాలని, సమస్యల పరిష్కారానికి తమ వంతు తోడ్పాటును అందించాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.
బుధవారం మునిపంపుల గ్రామ పరిధిలోని తుమ్మబావిగూడెంలో డాక్టర్ తత్తరి సాయిబాబు ఆర్థిక సహకారంతో సమకూర్చిన 25 ఎల్ఈడీ (LED) వీధి లైట్లను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో విద్యుత్ స్తంభాలకు అమర్చారు.
సమస్య పరిష్కారానికి తక్షణ స్పందన: ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ.. తుమ్మబావిగూడెంలో గత కొంతకాలంగా వీధి లైట్లు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ తత్తరి సాయిబాబు సామాజిక బాధ్యతతో, స్వచ్ఛందంగా ముందుకొచ్చి లైట్లను బహూకరించడం
అభినందనీయమన్నారు. ప్రజల సౌకర్యార్థం లైట్లను అందజేసిన సాయిబాబుకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని ఇతర అవసరాలకు కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు.
పాల్గొన్న వారు:
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు కట్ట అరుణ్ కుమార్, పట్టేటి నర్సింహా, అప్పం సురేందర్, గంటెపాక శివ కుమార్, బుంగ ప్రవీణ్, రావుల సైదులు, బండ్ల దయాకర్, గంటెపాక సాయి కుమార్, కట్ట శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి