Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

ముగ్ధంపల్లికి కొత్త సారథి: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం

ముగ్ధంపల్లికి కొత్త సారథి: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం

ముగ్ధంపల్లికి కొత్త సారథి: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం
December 22, 2025 05:20 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముగ్ధంపల్లికి కొత్త నాయకత్వం: సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ ప్రమాణం

స్థానికం ప్రతినిధి

బీబీనగర్ మండలం ముగ్ధంపల్లి గ్రామానికి కొత్త నాయకత్వం ఏర్పడింది. గ్రామ సర్పంచిగా శిగ నరేష్ గౌడ్ సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సెక్రెటరీ శైలజ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ— గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తూ, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారం ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో ముగ్ధంపల్లిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.

గ్రామంలోని ప్రతి పౌరుడి సమస్య తనదేనని, ప్రత్యక్షంగా గానీ, ఫోన్ ద్వారా గానీ తెలియజేస్తే వెంటనే స్పందించి సేవకుడిగా పనిచేస్తానని ప్రమాణ స్వీకార సభలో భగవంతుని సాక్షిగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శెట్టి సోని, వార్డు సభ్యులు ఎంజాల వెంకటేష్, మట్ట గోపికృష్ణ గౌడ్, ఎర్ర ప్రసన్న రెడ్డి, గోరుగంటి శంకర్, వడ్ల కొండ బాలకృష్ణ, పాదం రాధిక, బండారి సురేష్ పాల్గొన్నారు. గ్రామ సెక్రెటరీ శైలజతో పాటు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News