Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 AM

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
21-02-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ముందుగా మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష అమృతభాషగా, అజంతా భాషగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పేరుగాంచిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు.

అమ్మ భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మరువరాదని సూచించారు.

అనంతరం తెలుగు, హిందీ బోధిస్తున్న మహిళా ఉపాధ్యాయినులను సన్మానించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు అమరయ్య, సత్యనారాయణ రెడ్డి, తేరా రామారావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ముందుగా మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష అమృతభాషగా, అజంతా భాషగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పేరుగాంచిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు.

అమ్మ భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మరువరాదని సూచించారు.

అనంతరం తెలుగు, హిందీ బోధిస్తున్న మహిళా ఉపాధ్యాయినులను సన్మానించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు అమరయ్య, సత్యనారాయణ రెడ్డి, తేరా రామారావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News