మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మాతృభాష మహిమకు మహోత్సవ వేదిక – చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ముందుగా మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష అమృతభాషగా, అజంతా భాషగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పేరుగాంచిన తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు.
అమ్మ భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మరువరాదని సూచించారు.
అనంతరం తెలుగు, హిందీ బోధిస్తున్న మహిళా ఉపాధ్యాయినులను సన్మానించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు అమరయ్య, సత్యనారాయణ రెడ్డి, తేరా రామారావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి