మఠంపల్లి నూతన ఎస్సైగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
మఠంపల్లి నూతన ఎస్సైగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
Harish K
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
మఠంపల్లి నూతన ఎస్సై గా బి.ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.మునగాల మండలంలో పనిచేస్తూ మఠంపల్లి కి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న పి.బాబు నల్గొండ వీఆర్కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై బాబును పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ..మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు (Law and Order) పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి