మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం
మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం
K.RAVI
చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన డోకే రాజశేఖర్ (30) కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం… బుధవారం మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో రాజశేఖర్ తన ఇంటి నుండి వ్యవసాయ భూమికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు.సాయంత్రం అయ్యే వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.తరువాత కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పరిశీలించినా అక్కడ కూడా రాజశేఖర్ కనిపించలేదు. అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభించలేదు.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం రాజశేఖర్కు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఆయన ఎత్తు సుమారు 5 అడుగులు, చామన చాయతో ఉండి, ఇంటి నుండి వెళ్లిన సమయంలో మెరూన్ రంగు షర్టు, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు.ఈ ఘటనపై ఆయన అన్న డోకే శివ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి