మత్స్యవతారంలో నరసింహుడు
మత్స్యవతారంలో నరసింహుడు
Sthanikam District Staff Reporter
యాదగిరిగుట్ట టౌన్:యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవను వైభవంగా నిర్వహించారు.మత్స్యావతారంలో అలంకరించబడిన లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.సాయంత్రం శేష వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.శేష వాహనంపై విరాజిల్లే లక్ష్మీ నృసింహుడి దర్శనం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఈ సేవను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భవాని శంకర్,ఇతర అధికారులు,ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవల్లో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి