Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 AM

మత్స్యవతారంలో నరసింహుడు

మత్స్యవతారంలో నరసింహుడు

మత్స్యవతారంలో నరసింహుడు
February 20, 2026 08:18 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట టౌన్:యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవను వైభవంగా నిర్వహించారు.మత్స్యావతారంలో అలంకరించబడిన లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.సాయంత్రం శేష వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.శేష వాహనంపై విరాజిల్లే లక్ష్మీ నృసింహుడి దర్శనం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఈ సేవను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భవాని శంకర్,ఇతర అధికారులు,ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవల్లో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News