Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:12 PM

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం
March 23, 2026 07:50 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి సవిత మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు. సోమవారం సోమందేపల్లి పట్టణంలోని ఉర్దూ పాఠశాల సమీపంలో నూతన త్రాగునీటి బోర్‌వెల్ పనులను ప్రారంభించారు.

కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్ర, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి తదితరులు పాల్గొన్నారు. బోర్‌వెల్ తవ్వకాలకు ముందు గ్రామ పెద్దలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించగా, బోర్ లారీకి కూడా శుభారంభ పూజలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—గత ఎన్నికల సమయంలో ఉర్దూ పాఠశాల మరియు డి.ఎల్. రోడ్ పరిసర ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీని మంత్రి సవిత నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం అనిల్ బోర్‌వెల్ ద్వారా తవ్వకాల పనులు ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బోర్‌వెల్ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News