Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:52 AM

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం
23-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి సవిత మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు. సోమవారం సోమందేపల్లి పట్టణంలోని ఉర్దూ పాఠశాల సమీపంలో నూతన త్రాగునీటి బోర్‌వెల్ పనులను ప్రారంభించారు.

కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్ర, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి తదితరులు పాల్గొన్నారు. బోర్‌వెల్ తవ్వకాలకు ముందు గ్రామ పెద్దలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించగా, బోర్ లారీకి కూడా శుభారంభ పూజలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—గత ఎన్నికల సమయంలో ఉర్దూ పాఠశాల మరియు డి.ఎల్. రోడ్ పరిసర ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీని మంత్రి సవిత నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం అనిల్ బోర్‌వెల్ ద్వారా తవ్వకాల పనులు ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బోర్‌వెల్ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Sthanikam

మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత… సోమందేపల్లిలో నూతన బోర్ ప్రారంభం

Article Image

సోమందేపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి సవిత మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు. సోమవారం సోమందేపల్లి పట్టణంలోని ఉర్దూ పాఠశాల సమీపంలో నూతన త్రాగునీటి బోర్‌వెల్ పనులను ప్రారంభించారు.

కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్ర, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి తదితరులు పాల్గొన్నారు. బోర్‌వెల్ తవ్వకాలకు ముందు గ్రామ పెద్దలు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించగా, బోర్ లారీకి కూడా శుభారంభ పూజలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—గత ఎన్నికల సమయంలో ఉర్దూ పాఠశాల మరియు డి.ఎల్. రోడ్ పరిసర ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీని మంత్రి సవిత నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం అనిల్ బోర్‌వెల్ ద్వారా తవ్వకాల పనులు ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బోర్‌వెల్ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News