Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:58 AM

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు
February 22, 2026 03:08 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రూ.6 కోట్లకు పైగా నిధులతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయ్

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం పరిధిలో ఉన్న కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన దత్తత హామీని నిలబెట్టుకుంటూ ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఉపముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావస్తోంది. సుమారు 2 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందనుంది.

రహదారులు – మౌలిక వసతుల విస్తరణ

పల్లెపండగ 1.0 కింద మూడు సి.సి. రోడ్లు పూర్తి కాగా, పల్లెపండగ 2.0 కింద మరో ఏడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు 5 కి.మీ బి.టి రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. గ్రామానికి వచ్చే ఆర్ & బి రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు కేటాయించారు.

గృహాలు – రైతులకు ఊతం

19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసి, రెండు మైనర్ కాలువలను పునరుద్ధరించారు. మూడు చెక్ డ్యామ్స్ మరమ్మతులతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

తన ఇంటిపేరుతో ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఉపముఖ్యమంత్రి చర్యలు గ్రామ ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయి. “మాట ఇచ్చి నిలబెట్టిన నాయకుడు” అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News