Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:38 AM

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు
22-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రూ.6 కోట్లకు పైగా నిధులతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయ్

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం పరిధిలో ఉన్న కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన దత్తత హామీని నిలబెట్టుకుంటూ ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఉపముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావస్తోంది. సుమారు 2 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందనుంది.

రహదారులు – మౌలిక వసతుల విస్తరణ

పల్లెపండగ 1.0 కింద మూడు సి.సి. రోడ్లు పూర్తి కాగా, పల్లెపండగ 2.0 కింద మరో ఏడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు 5 కి.మీ బి.టి రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. గ్రామానికి వచ్చే ఆర్ & బి రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు కేటాయించారు.

గృహాలు – రైతులకు ఊతం

19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసి, రెండు మైనర్ కాలువలను పునరుద్ధరించారు. మూడు చెక్ డ్యామ్స్ మరమ్మతులతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

తన ఇంటిపేరుతో ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఉపముఖ్యమంత్రి చర్యలు గ్రామ ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయి. “మాట ఇచ్చి నిలబెట్టిన నాయకుడు” అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Sthanikam

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

Article Image

రూ.6 కోట్లకు పైగా నిధులతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయ్

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం పరిధిలో ఉన్న కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన దత్తత హామీని నిలబెట్టుకుంటూ ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఉపముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావస్తోంది. సుమారు 2 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందనుంది.

రహదారులు – మౌలిక వసతుల విస్తరణ

పల్లెపండగ 1.0 కింద మూడు సి.సి. రోడ్లు పూర్తి కాగా, పల్లెపండగ 2.0 కింద మరో ఏడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు 5 కి.మీ బి.టి రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. గ్రామానికి వచ్చే ఆర్ & బి రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు కేటాయించారు.

గృహాలు – రైతులకు ఊతం

19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసి, రెండు మైనర్ కాలువలను పునరుద్ధరించారు. మూడు చెక్ డ్యామ్స్ మరమ్మతులతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

తన ఇంటిపేరుతో ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఉపముఖ్యమంత్రి చర్యలు గ్రామ ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయి. “మాట ఇచ్చి నిలబెట్టిన నాయకుడు” అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News