Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:30 AM

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు

మాట ఇచ్చి నిలబెట్టిన ఉపముఖ్యమంత్రి – కొణిదెలలో అభివృద్ధి జోరు
February 22, 2026 03:08 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రూ.6 కోట్లకు పైగా నిధులతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయ్

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం పరిధిలో ఉన్న కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన దత్తత హామీని నిలబెట్టుకుంటూ ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఉపముఖ్యమంత్రి తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావస్తోంది. సుమారు 2 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందనుంది.

రహదారులు – మౌలిక వసతుల విస్తరణ

పల్లెపండగ 1.0 కింద మూడు సి.సి. రోడ్లు పూర్తి కాగా, పల్లెపండగ 2.0 కింద మరో ఏడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు 5 కి.మీ బి.టి రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. గ్రామానికి వచ్చే ఆర్ & బి రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు కేటాయించారు.

గృహాలు – రైతులకు ఊతం

19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసి, రెండు మైనర్ కాలువలను పునరుద్ధరించారు. మూడు చెక్ డ్యామ్స్ మరమ్మతులతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

తన ఇంటిపేరుతో ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఉపముఖ్యమంత్రి చర్యలు గ్రామ ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయి. “మాట ఇచ్చి నిలబెట్టిన నాయకుడు” అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News