భోగారంలో బతికే ఉన్న మానవత్వం
స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ కడారి శారద ఆకస్మికంగా మృతిచెందగా గ్రామం కదిలిపోయింది. తల్లి శవం పక్కన కుమారుడి ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి.
స్పందించిన గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. గ్రామ యువత, ప్రజలు ఫోన్పే ద్వారా తోచిన సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలు పూర్తయ్యాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి