Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
December 27, 2025 10:47 AM 320 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలువురి కుటుంబాలను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం స్థానిక ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలువురు మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల సైదులు, దొరపల్లి వెంకటమ్మ, కటికం లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే మండల కేంద్రానికి చెందిన నల్ల బిక్షం అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య, నీలకంఠం బాలనర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అలాగే అదే మండలానికి చెందిన మొగిలి యాదమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన పెండెం పార్వతమ్మ, 11వ వార్డుకు చెందిన ముశాం కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News