Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:31 PM

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
December 27, 2025 10:47 AM 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలువురి కుటుంబాలను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం స్థానిక ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలువురు మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల సైదులు, దొరపల్లి వెంకటమ్మ, కటికం లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే మండల కేంద్రానికి చెందిన నల్ల బిక్షం అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య, నీలకంఠం బాలనర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అలాగే అదే మండలానికి చెందిన మొగిలి యాదమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన పెండెం పార్వతమ్మ, 11వ వార్డుకు చెందిన ముశాం కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News