Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:22 PM

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
December 27, 2025 10:47 AM 310 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలువురి కుటుంబాలను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం స్థానిక ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలువురు మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల సైదులు, దొరపల్లి వెంకటమ్మ, కటికం లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే మండల కేంద్రానికి చెందిన నల్ల బిక్షం అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య, నీలకంఠం బాలనర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అలాగే అదే మండలానికి చెందిన మొగిలి యాదమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన పెండెం పార్వతమ్మ, 11వ వార్డుకు చెందిన ముశాం కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News