మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
మృతుల కుటుంబాలను ఓదార్చిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
పలువురి కుటుంబాలను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం స్థానిక ప్రతినిధి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలువురు మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల సైదులు, దొరపల్లి వెంకటమ్మ, కటికం లింగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే మండల కేంద్రానికి చెందిన నల్ల బిక్షం అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య, నీలకంఠం బాలనర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అలాగే అదే మండలానికి చెందిన మొగిలి యాదమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన పెండెం పార్వతమ్మ, 11వ వార్డుకు చెందిన ముశాం కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి