మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..
మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..
NM Yadav
లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేత పిల్లల చదువుకు హామీ..
నల్గొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనగల్ మండల కేంద్రానికి చెందిన ఎటెల్లి పరశురాం కుటుంబానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. గురువారం నాడు ఆయన పరశురాం నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మృతుడి భార్య సంధ్యను మరియు పిల్లలను ఓదార్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద తన వ్యక్తిగత నిధుల నుండి ఒక లక్ష రూపాయల నగదును వారికి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పరశురాం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారి చదువుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు పరశురాం మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబం వీధిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగానూ అన్ని విధాలా ఆదుకుంటాం అని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి