Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 09:58 PM

మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..

మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..

మృతుడి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా..
March 26, 2026 06:49 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేత పిల్లల చదువుకు హామీ..


నల్గొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనగల్ మండల కేంద్రానికి చెందిన ఎటెల్లి పరశురాం కుటుంబానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. గురువారం నాడు ఆయన పరశురాం నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మృతుడి భార్య సంధ్యను మరియు పిల్లలను ఓదార్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద తన వ్యక్తిగత నిధుల నుండి ఒక లక్ష రూపాయల నగదును వారికి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పరశురాం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారి చదువుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు పరశురాం మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబం వీధిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగానూ అన్ని విధాలా ఆదుకుంటాం అని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News