మార్పు సాయికుమార్ తోనే
మార్పు సాయికుమార్ తోనే
Editor Desk
భోగారం గ్రామంలో రాజకీయ గాలులు మరింత వేడెక్కుతున్నాయి..
బీఆర్ఎస్ యువ నేత సాయికుమార్ గౌడ్ సర్పంచ్ బరిలో!
స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామం లో రెండో విడత సర్పంచ్ ఎన్నికల వేట ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయలు వేడెక్కాయి . బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గా యువ నాయకుడు, సేవాభావంతో పేరొందిన కూనూరు సాయికుమార్ గౌడ్ బరిలో నిలబడటంతో గ్రామంలో మార్పు సందేశం తిరుగుతోంది.గ్రామ అభివృద్ధి పట్ల కలిగి ఉన్న అపార ప్రతిభతో సాయికుమార్, గ్రామ ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలకు నిత్యం కృషి చేస్తున్నారు. ఆయన బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు , అంబేద్కర్ చౌరస్తాలో నుంచి ఇంటింటి ప్రచార యాత్ర ప్రారంభించారు.ప్రజల సమస్యలను ప్రత్యక్షంగానే అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి తాము ప్రతిజ్ఞ చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “ఏ కష్టమైనా పంచుకోండి, నేను మీతోనే ఉంటాను. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని మీ ముందే హామీ ఇస్తున్నాను” అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్ మాట్లాడుతూ మార్పు సాయికుమార్ తోనేనని నలుమూలల ఇంటింటి ప్రచారం నిర్వహించి సాయికుమార్ గౌడ్ ఇప్పటివరకు అందించిన సేవలు, అమలు చేసిన అభివృద్ధి పథకాలు, భవిష్యతలో పూర్తి చేయవలసిన పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి