Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

మార్జిన్‌ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌

మార్జిన్‌ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌

మార్జిన్‌ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌
March 31, 2026 05:01 PM 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్‌ షాపులు నిరవధికంగా బంద్‌ కానున్నాయి. ఫౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్జిన్‌ను పెంచే వరకు విక్రయాలు నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్‌ షాప్‌ యజమానులు నిర్ణయించారు.చికెన్‌ విక్రయాల్లో తగిన లాభం లేకపోవడం వల్ల వ్యాపారం నష్టాల్లోకి వెళ్లుతోందని షాప్‌ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫౌల్ట్రీ కంపెనీలు ఇటీవల మార్జిన్‌ను తగ్గించడంతో తమపై ఆర్థిక భారం మరింత పెరిగిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యమైందని తెలిపారు.ఈ నేపథ్యంలో మార్జిన్‌ను పునర్విమర్శించి పెంచాలని డిమాండ్‌ చేస్తూ, రేపటి నుంచినిరవధికబంద్‌కుపిలుపునిచ్చినట్లు తెలంగాణ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఫౌల్ట్రీ కంపెనీలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు బంద్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ బంద్‌ ప్రభావంతో రాష్ట్రంలో చికెన్‌ సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులు ప్రత్యామ్నాయాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు.ఇకపోతే, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News