మార్జిన్ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్
మార్జిన్ వివాదం: తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్
Komidala Mahender reddy
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు నిరవధికంగా బంద్ కానున్నాయి. ఫౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ను తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్జిన్ను పెంచే వరకు విక్రయాలు నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాప్ యజమానులు నిర్ణయించారు.చికెన్ విక్రయాల్లో తగిన లాభం లేకపోవడం వల్ల వ్యాపారం నష్టాల్లోకి వెళ్లుతోందని షాప్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫౌల్ట్రీ కంపెనీలు ఇటీవల మార్జిన్ను తగ్గించడంతో తమపై ఆర్థిక భారం మరింత పెరిగిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యమైందని తెలిపారు.ఈ నేపథ్యంలో మార్జిన్ను పునర్విమర్శించి పెంచాలని డిమాండ్ చేస్తూ, రేపటి నుంచినిరవధికబంద్కుపిలుపునిచ్చినట్లు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఫౌల్ట్రీ కంపెనీలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈ బంద్ ప్రభావంతో రాష్ట్రంలో చికెన్ సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులు ప్రత్యామ్నాయాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు.ఇకపోతే, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి