Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:41 PM

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి : వేముల బక్కయ్య

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి : వేముల బక్కయ్య

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి : వేముల బక్కయ్య
March 09, 2026 06:04 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నందిపాము రాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు మిఠాయిలు పంచారు.

సభలో మహిళా సభ్యులు మాట్లాడుతూ రమణక్కపేట ఎస్సీ దళితవాడలో మినీ అంగనవాడి సెంటర్ మంజూరు చేయాలని జిల్లా కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని దార బేబీ శాలిని కోరారు. ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని నందిపాము రాణి, స్మశానవాటిక భూమి మంజూరు చేయాలని ఆముదాల సామ్రాజ్యం, పశు వైద్యశాలకు నూతన భవనం నిర్మించాలని వేముల మహాలక్ష్మి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సంఘటిత మహిళా పోరాటాలకు ప్రతీక అని తెలిపారు. 120 సంవత్సరాల క్రితం అమెరికాలో మహిళా కార్మికులు అధిక పనిగంటలు, తక్కువ వేతనాలు, దుర్భరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాలు నిర్వహించారని అన్నారు. ఆ పోరాటం మహిళల ఓటుహక్కు, సమానత్వం కోసం ఉద్యమంగా మారి 1910లో కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్‌కిన్ పిలుపుతో మార్చి 8ను అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని, వీబీ గ్రామజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌పీ కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని, ఫారెస్ట్ రెవెన్యూ గ్రామాల్లో రైతులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించి సాగుభూములకు పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ నాలుగో నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. అలాగే ఆడబిడ్డ నిధిగా నెలకు రూ.1500 ఇవ్వాలని, కౌలు రైతులకు హామీలేని రుణాలు అందించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందిపాము రాణి, వేముల మహాలక్ష్మి, ఆముదాల పార్వతి, ఆముదాల చినబాబు, వేముల చంటి, ఉయ్యూరు విజయలక్ష్మి, ఆముదాల వరాజ్యం, నందిపాము నవ్య, తానంకి మరియమ్మ, ఆముదాల సుగంధరాణి, ఆముదాల నాగరత్నం, దారా బేబీ శాలిని, ఆముదాల ప్రవళిక, నందిపాము రత్నకుమారి, ఆముదాల రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News