Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:43 AM

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
December 16, 2025 07:43 PM 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాట్లపై కలెక్టర్ తనిఖీ

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అడ్డగూడూరు, మోత్కూరు, మోటకొండూర్, గుండాల, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రం, అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ బూత్ బయట గుర్తులతో కూడిన ఫారం–9ను అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

పండుగ వాతావరణంలో పోలింగ్ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మట్టి కుండల్లో తాగునీరు, పోలింగ్ కేంద్రాల ముందు రంగవల్లులు, పచ్చని మొక్కలతో అలంకరణ, కొబ్బరి మట్టలు, పూలతో సౌందర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అరటి ఆకులతో సెల్ఫీ పాయింట్లు, గ్రీన్ మ్యాట్‌లు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

6 మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు

జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  1. అడ్డగూడూరు మండలం: చౌళ్ల రామారం
  2. మోత్కూరు మండలం: పాటిమట్ల
  3. గుండాల మండలం: పాచిల్ల
  4. మోటకొండూర్ మండలం: ముత్తిరెడ్డి గూడెం
  5. చౌటుప్పల్ మండలం: అరెగూడెం
  6. నారాయణపూర్ మండలం: చిమిర్యాల

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News