PRINT TIME: February 23, 2026 11:39 PM
మూడవ విడత పోలింగ్కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
మూడవ విడత పోలింగ్కు సర్వం సిద్ధం పర్యావరణహిత ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
December 16, 2025 07:43 PM
101 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాట్లపై కలెక్టర్ తనిఖీ
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అడ్డగూడూరు, మోత్కూరు, మోటకొండూర్, గుండాల, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం, అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ బూత్ బయట గుర్తులతో కూడిన ఫారం–9ను అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
పండుగ వాతావరణంలో పోలింగ్ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మట్టి కుండల్లో తాగునీరు, పోలింగ్ కేంద్రాల ముందు రంగవల్లులు, పచ్చని మొక్కలతో అలంకరణ, కొబ్బరి మట్టలు, పూలతో సౌందర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అరటి ఆకులతో సెల్ఫీ పాయింట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
6 మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- అడ్డగూడూరు మండలం: చౌళ్ల రామారం
- మోత్కూరు మండలం: పాటిమట్ల
- గుండాల మండలం: పాచిల్ల
- మోటకొండూర్ మండలం: ముత్తిరెడ్డి గూడెం
- చౌటుప్పల్ మండలం: అరెగూడెం
- నారాయణపూర్ మండలం: చిమిర్యాల
ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి