మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్
మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్
Editor Desk
కూసుమంచిలో యూరియా సరఫరాపై ప్రత్యేక అధికారి తనిఖీ
ఖమ్మం స్థానిక ప్రతినిధి జనార్ధన్
కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు చేగోమ్మ, కూసుమంచి ప్రాంతాల్లో ఉన్న మన గ్రోమోర్ సెంటర్లలో యూరియా పంపిణీ విధానాన్ని హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చంద్రశేఖర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొక్కజొన్న, వరి నాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్కు అనుగుణంగా యూరియా నిల్వలు కొనసాగిస్తామని, వానాకాలంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓలు జానీ, రవికుమార్, రవీందర్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి