Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్
31-12-2025 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో యూరియా సరఫరాపై ప్రత్యేక అధికారి తనిఖీ

ఖమ్మం స్థానిక ప్రతినిధి జనార్ధన్

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు చేగోమ్మ, కూసుమంచి ప్రాంతాల్లో ఉన్న మన గ్రోమోర్ సెంటర్లలో యూరియా పంపిణీ విధానాన్ని హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చంద్రశేఖర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొక్కజొన్న, వరి నాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్‌కు అనుగుణంగా యూరియా నిల్వలు కొనసాగిస్తామని, వానాకాలంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓలు జానీ, రవికుమార్, రవీందర్ పాల్గొన్నారు.

Sthanikam

మొక్కజొన్న, వరి రైతులకు యూరియా కొరత లేదు: డీడీఏ చంద్రశేఖర్

Article Image

కూసుమంచిలో యూరియా సరఫరాపై ప్రత్యేక అధికారి తనిఖీ

ఖమ్మం స్థానిక ప్రతినిధి జనార్ధన్

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు చేగోమ్మ, కూసుమంచి ప్రాంతాల్లో ఉన్న మన గ్రోమోర్ సెంటర్లలో యూరియా పంపిణీ విధానాన్ని హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చంద్రశేఖర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొక్కజొన్న, వరి నాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్‌కు అనుగుణంగా యూరియా నిల్వలు కొనసాగిస్తామని, వానాకాలంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓలు జానీ, రవికుమార్, రవీందర్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News