Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:42 PM

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం
January 02, 2026 08:19 AM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల, కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో కోతుల బెడదకు చెక్ పెట్టే దిశగా సర్పంచ్ కాటం వెంకటేశం తొలి అడుగు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మొదటి హామీని నూతన సంవత్సరంలోనే అమలు చేస్తూ గురువారం ఆంధ్రకు చెందిన నిపుణులను తీసుకువచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి పంటలు, ఇళ్లకు నష్టం కలిగించడంతో పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా కోతులను పట్టినట్లు పేర్కొన్నారు. కోతుల సమస్య పూర్తిగా నివారించి గ్రామాన్ని సురక్షితంగా మార్చడమే లక్ష్యమన్నారు.

ఈ చర్యతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయగా, చిన్నపిల్లలు–వృద్ధుల్లో నెలకొన్న భయాందోళన తగ్గుతుందని ఆశాభావం వ్యక్తమైంది. వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ కాటం వెంకటేశాన్ని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News