Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:57 AM

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం
02-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల, కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో కోతుల బెడదకు చెక్ పెట్టే దిశగా సర్పంచ్ కాటం వెంకటేశం తొలి అడుగు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మొదటి హామీని నూతన సంవత్సరంలోనే అమలు చేస్తూ గురువారం ఆంధ్రకు చెందిన నిపుణులను తీసుకువచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి పంటలు, ఇళ్లకు నష్టం కలిగించడంతో పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా కోతులను పట్టినట్లు పేర్కొన్నారు. కోతుల సమస్య పూర్తిగా నివారించి గ్రామాన్ని సురక్షితంగా మార్చడమే లక్ష్యమన్నారు.

ఈ చర్యతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయగా, చిన్నపిల్లలు–వృద్ధుల్లో నెలకొన్న భయాందోళన తగ్గుతుందని ఆశాభావం వ్యక్తమైంది. వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ కాటం వెంకటేశాన్ని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Sthanikam

మొదటి వాగ్దానం అమలు చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

Article Image
చిట్యాల, కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో కోతుల బెడదకు చెక్ పెట్టే దిశగా సర్పంచ్ కాటం వెంకటేశం తొలి అడుగు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మొదటి హామీని నూతన సంవత్సరంలోనే అమలు చేస్తూ గురువారం ఆంధ్రకు చెందిన నిపుణులను తీసుకువచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి పంటలు, ఇళ్లకు నష్టం కలిగించడంతో పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా కోతులను పట్టినట్లు పేర్కొన్నారు. కోతుల సమస్య పూర్తిగా నివారించి గ్రామాన్ని సురక్షితంగా మార్చడమే లక్ష్యమన్నారు.

ఈ చర్యతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయగా, చిన్నపిల్లలు–వృద్ధుల్లో నెలకొన్న భయాందోళన తగ్గుతుందని ఆశాభావం వ్యక్తమైంది. వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ కాటం వెంకటేశాన్ని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News