“మానూర్ మండల క్రీడల విజయవంతమైన నిర్వహణకు ఘన సన్మానం”
“మానూర్ మండల క్రీడల విజయవంతమైన నిర్వహణకు ఘన సన్మానం”
Krishna
మానూర్ మండల స్థాయి సీఎం కప్ 2025 క్రీడలు విజయవంతంగా నిర్వహించడానికి విశేష సహకారం అందించిన బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ రవికుమార్,పీడీ మల్లికార్జున్ వ్యాయామ ఉపాధ్యాయులను మనూరు మండల ఎంపీడీవో రాజశేఖర్,డిప్యూటీ తహసీల్దార్ మరియు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ చేతుల మీదుగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు పాల్గొని, క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల ప్రతిభ, పట్టుదల మరియు సమర్పణకు ప్రశంసలు తెలిపారు.క్రీడల ద్వారా పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఉపాధ్యాయులు అందించిన మార్గనిర్దేశం,సహకారం మరియు కృషి సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి,క్రీడా కార్యక్రమాల ఉత్సాహవంతమైన నిర్వహణకు ఒక వెలుగువంటి ఉదాహరణగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి