Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:17 AM

మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు
22-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డి సురేఖ భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో,ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ స్పందించి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బాధిత కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి ఆర్థికంగా భరోసా కల్పించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు జీఎంఆర్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ఫౌండేషన్ సేవా సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, అభి పాల్గొనగా, రామ్తీర్థ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు అంబన్న, ఉమాకాంత్ రెడ్డి, రాజు, జ్ఞాను పటేల్, అంజి, శివాజీ, ఆకుల రవి, శ్రీనివాస్, సాయిలు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డి సురేఖ భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో,ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ స్పందించి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బాధిత కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి ఆర్థికంగా భరోసా కల్పించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు జీఎంఆర్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ఫౌండేషన్ సేవా సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, అభి పాల్గొనగా, రామ్తీర్థ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు అంబన్న, ఉమాకాంత్ రెడ్డి, రాజు, జ్ఞాను పటేల్, అంజి, శివాజీ, ఆకుల రవి, శ్రీనివాస్, సాయిలు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News