మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు
మానవత్వాన్ని చాటుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డి సురేఖ భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో,ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ స్పందించి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బాధిత కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి ఆర్థికంగా భరోసా కల్పించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు జీఎంఆర్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ఫౌండేషన్ సేవా సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, అభి పాల్గొనగా, రామ్తీర్థ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు అంబన్న, ఉమాకాంత్ రెడ్డి, రాజు, జ్ఞాను పటేల్, అంజి, శివాజీ, ఆకుల రవి, శ్రీనివాస్, సాయిలు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి