PRINT TIME: March 28, 2026 07:47 PM
మానవసేవే మాధవసేవ ఖేడ్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్
మానవసేవే మాధవసేవ ఖేడ్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్
March 28, 2026 05:43 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సమాజ హితం కాంక్షించి సమస్త ప్రాణుల సంరక్షణ ధ్యేయంగా నిరంతర సేవా కార్యక్రమాలతో ముందుండాలని ఖేడ్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్ అన్నారు. శనివారం నాడు నెట్ డాటా డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ సహకారంతో ఆర్థిక అవసరాలు ఉన్న దుర్గ భవానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, విద్యా సామాగ్రి, క్రీడా సామాగ్రి , రక్తదాన శిబిరాలు, ఉచిత కంటి చికిత్సలు ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ ఇంచార్జ్ హెచ్ఎం రాజశేఖర్, జోన్ చైర్మన్ రాజ్ కుమార్ , సభ్యులు చంద్రశేఖర్ ఆచార్య , జైపాల్ రెడ్డి, దన్ సింగ్ హమీద్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి