మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.
మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.
Editor Desk
రామన్నపేట
మానసిక వికలాంగులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వైద్య సేవలు అందించాలని రామన్నపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి. సబిత సూచించారు.
మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆమె ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో మానసిక వికలాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సేవలు, సంరక్షణ విధానాలపై ఆరా తీశారు.
వికలాంగులకు అందిస్తున్న భోజనం నాణ్యతతో ఉండాలని, ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహించాలని, వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆశ్రమంలోని రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇంచార్జీలు మీనాక్షి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలిగొండలోని శాంతి నిలయం ఆశ్రమాన్ని కూడా జడ్జి సబిత సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి