మానసిక ఒత్తిడి వీడి పరీక్షల్లో విజయం సాధించాలి......
మానసిక ఒత్తిడి వీడి పరీక్షల్లో విజయం సాధించాలి......
Harish HS
విద్యార్థులు పరీక్షల పట్ల భయం విడాలి.....
మానసిక,వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగాండ్ల రాజశేఖర్......
పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగుండ్ల రాజశేఖర్ సూచించారు. మంగళవారం బాలాజీనగర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జయంబు నిశ్చయంబురా’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే ఫలితాలు బాగుంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షల చివరి దశలో అనుసరించాల్సిన విద్యా మెళకువలను విద్యార్థులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ డబ్ల్యు ఓ నాగజ్యోతి, నాగేశ్వరరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు....
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి