Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:26 AM

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఎస్.ఎస్.ఏ. ఏలూరు

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఎస్.ఎస్.ఏ. ఏలూరు

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్  ఎస్.ఎస్.ఏ. ఏలూరు
February 17, 2026 11:11 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్య- సుధీర్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్

ఎస్.ఎస్.ఏ. ఏలూరు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ స్కూల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా జి.సి.డి.ఓ. బి. నవీనకుమారి, ఏ. పి. సి. డా. కె. పంకజ్ కుమార్ ల పర్యవేక్షణలో చింతలపూడి మండలం, డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులం బాలురు హైస్కూల్ చింతలపూడి లో ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్స్ ఏం. సుధీర్ కుమార్

14,17 తేదీలలో విద్యార్థులకు కెరీర్ మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన సెషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతోనే నాణ్యమైన విద్యా సాధ్యం అని, విద్యార్ధులు అపోహలకు దూరంగా ఉండాలని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని చదువులో రాణించాలని, క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, లక్ష్యం ఆధారిత చదువు అలవాటు చేసుకోవాలని, ప్రతీ రోజూ ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలని, యోగా, ధ్యానం మరియు ఆటపాటలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని విద్యార్థి దశ నుంచే వినూత్నంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని, మొబైల్, డ్రగ్స్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని సూచించారు.అనంతరం విద్యార్దులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో యాక్టివిటీస్ ద్వారా వివరించారు. ఉపాద్యాయులు విద్యార్ధులతో ప్రేమగా మెలగాలని, వారి సమస్యలు ఎప్పటికపుడు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ్ గారు మాట్లాడుతూ ఇలాంటి మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరం అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జి.సి.డి.ఓ. బి. నవీన కుమారి, ఏ.పీ.సి. పంకజ్ కుమార్, జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ ఏం. సుధీర్ కుమార్ గార్లకు కృతద్నతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఒక సైకియాట్రీస్ట్ లేదా సైకాలజిస్ట్ ను సంప్రదించటానికి నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్: టెలి మానస నెంబర్ 14416, ను స్కూల్ ఆవరణలో లో ప్రదర్శించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News