Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:33 PM

మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు

మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు

మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు
December 26, 2025 08:49 PM 393 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుభాష్ సెంటర్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దిన్ మాట్లాడుతూ, దేశ ప్రగతిలో మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన గొప్ప మేధావిగా, సంస్కరణల పితామహుడిగా దేశ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జినుకల ప్రభాకర్, మొహమ్మద్ నాసర్, వనం చంద్రశేఖర్, జెల్లా వెంకటేష్, కొత్తపల్లి అబ్రహం, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, మొహమ్మద్ అజార్, మొహమ్మద్ రిజ్వాన్, పల్లపు రవి, గంగపురం శంకర్, కత్తిలేని రవీందర్, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News