మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు
మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు
Editor Desk
సుభాష్ సెంటర్లో మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు
రామన్నపేట: స్థానికం ప్రతినిధి
భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దిన్ మాట్లాడుతూ, దేశ ప్రగతిలో మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన గొప్ప మేధావిగా, సంస్కరణల పితామహుడిగా దేశ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జినుకల ప్రభాకర్, మొహమ్మద్ నాసర్, వనం చంద్రశేఖర్, జెల్లా వెంకటేష్, కొత్తపల్లి అబ్రహం, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, మొహమ్మద్ అజార్, మొహమ్మద్ రిజ్వాన్, పల్లపు రవి, గంగపురం శంకర్, కత్తిలేని రవీందర్, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి