ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.13,200 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విస్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. అర్జున్ రాజు తెలిపారు.
గూఢ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించగా పేకాట ఆడుతున్న పలువురు వ్యక్తులను పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి