మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ
మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
నల్గొండ ముద్దుబిడ్డకు పద్మశ్రీ
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, యూజీసీ మాజీ చైర్మన్, జేఎన్యూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్కు పద్మశ్రీ అవార్డు దక్కింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.
దేశంలోని ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు ఆయన చేసిన కృషి విశేషమని కేంద్రం పేర్కొంది. యూజీసీ చైర్మన్గా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వర్తించిన సమయంలో విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ప్రోత్సాహం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై జగదీష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి గౌరవం అందుకోవడం నల్గొండ జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పద్మశ్రీ ప్రకటించడంతో మామిడాల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి