Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:05 PM

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ
25-01-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ ముద్దుబిడ్డకు పద్మశ్రీ

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, యూజీసీ మాజీ చైర్మన్‌, జేఎన్‌యూ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.

దేశంలోని ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు ఆయన చేసిన కృషి విశేషమని కేంద్రం పేర్కొంది. యూజీసీ చైర్మన్‌గా, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ప్రోత్సాహం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై జగదీష్‌ కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి గౌరవం అందుకోవడం నల్గొండ జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పద్మశ్రీ ప్రకటించడంతో మామిడాల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Sthanikam

మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ ముద్దుబిడ్డకు పద్మశ్రీ

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, యూజీసీ మాజీ చైర్మన్‌, జేఎన్‌యూ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.

దేశంలోని ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు ఆయన చేసిన కృషి విశేషమని కేంద్రం పేర్కొంది. యూజీసీ చైర్మన్‌గా, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ప్రోత్సాహం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై జగదీష్‌ కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి గౌరవం అందుకోవడం నల్గొండ జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పద్మశ్రీ ప్రకటించడంతో మామిడాల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News