Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:30 AM

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం
March 19, 2026 01:38 PM 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉపసర్పంచ్ తుమ్మ సతీష్


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని,ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమ‌యం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గండు వీరయ్య,పార్టీ సీనియర్ నాయకులు సోమపంగు జానయ్య,మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోమపంగు అక్కమ్మ,పార్టీ సభ్యులు తిరపయ్య, ఆదినారాయణ.రామస్వామి,వెంకయ్య,రవి,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News