Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:52 PM

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన
February 04, 2026 07:15 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేట మళ్లీ పాత దుస్థితికి చేరిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల హయాంలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవించారని, బిఆర్ఎస్ పాలనలో వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. అప్పట్లో దౌర్జన్యాలు లేని సూర్యాపేటలో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దందాలు పరిస్థితులు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఇది మంచి అవకాశం అంటూ, ఓటుతోనే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అంతటి విజయ్ కుమార్, శ్రీనివాస్, గుంటి సైదులు, బండారి సతీష్, బందు ఉపేందర్, గుణగంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News