Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన

మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన
February 04, 2026 07:15 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేట మళ్లీ పాత దుస్థితికి చేరిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల హయాంలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవించారని, బిఆర్ఎస్ పాలనలో వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. అప్పట్లో దౌర్జన్యాలు లేని సూర్యాపేటలో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దందాలు పరిస్థితులు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఇది మంచి అవకాశం అంటూ, ఓటుతోనే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అంతటి విజయ్ కుమార్, శ్రీనివాస్, గుంటి సైదులు, బండారి సతీష్, బందు ఉపేందర్, గుణగంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News