కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేట మళ్లీ పాత దుస్థితికి చేరిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల హయాంలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవించారని, బిఆర్ఎస్ పాలనలో వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. అప్పట్లో దౌర్జన్యాలు లేని సూర్యాపేటలో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దందాలు పరిస్థితులు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఇది మంచి అవకాశం అంటూ, ఓటుతోనే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అంతటి విజయ్ కుమార్, శ్రీనివాస్, గుంటి సైదులు, బండారి సతీష్, బందు ఉపేందర్, గుణగంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this Article4 Shares
బుధవారం
Feb
04
2026
ప్రాంతీయ వార్తలు | సూర్యాపేట
Biksham
మళ్లీ సూర్యాపేటను పాత రోజులకు నెట్టిన కాంగ్రెస్ పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేట మళ్లీ పాత దుస్థితికి చేరిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల హయాంలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవించారని, బిఆర్ఎస్ పాలనలో వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. అప్పట్లో దౌర్జన్యాలు లేని సూర్యాపేటలో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దందాలు పరిస్థితులు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఇది మంచి అవకాశం అంటూ, ఓటుతోనే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అంతటి విజయ్ కుమార్, శ్రీనివాస్, గుంటి సైదులు, బండారి సతీష్, బందు ఉపేందర్, గుణగంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి