మల్లన్న గుట్టకు పోటెత్తిన భక్తులు
మల్లన్న గుట్టకు పోటెత్తిన భక్తులు
Editor Desk
స్థానికం – రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పరిసర మండలాల నుంచి కూడా భక్తులు చేరుకుని మల్లన్న గుట్ట భక్తిజన సంద్రంగా మారింది.
ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్ఛారణలు, భజనలతో మార్మోగగా భక్తుల విశ్వాసం ఉత్సాహంగా వ్యక్తమైంది.
పండుగ వాతావరణాన్ని తలపించేలా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొనగా, దర్శనాల కోసం క్యూలైన్లలో భక్తులు ఓపికతో వేచిచూశారు. కొత్త సంవత్సరం అందరికీ శుభఫలితాలు అందించాలని స్వామివారిని వేడుకుంటూ భక్తులు తమ మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి