Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:46 AM

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు
February 15, 2026 07:19 PM 746 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో ప్రారంభంకానున్నాయి. చిన్న శ్రీశైలం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం రామన్నపేట ఎస్‌ఐ డి నాగరాజు సమగ్రంగా పరిశీలించారు.

బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి జాగారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, మరుసటి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని నియంత్రించేందుకు వాలంటీర్లు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ డి నాగరాజు ఆలయ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్‌కు సూచించారు. పార్కింగ్, తాగునీరు, విద్యుత్ వెలుగులు, క్యూ లైన్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడియ్య, భాష మల్ల బాలరాజు, సంకు స్వామి, నాయకులు గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లేశం గౌడ్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, వర్కల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News