Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:29 AM

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ఎస్‌ఐ డి నాగరాజు
February 15, 2026 07:19 PM 752 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో ప్రారంభంకానున్నాయి. చిన్న శ్రీశైలం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం రామన్నపేట ఎస్‌ఐ డి నాగరాజు సమగ్రంగా పరిశీలించారు.

బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి జాగారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, మరుసటి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని నియంత్రించేందుకు వాలంటీర్లు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ డి నాగరాజు ఆలయ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్‌కు సూచించారు. పార్కింగ్, తాగునీరు, విద్యుత్ వెలుగులు, క్యూ లైన్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడియ్య, భాష మల్ల బాలరాజు, సంకు స్వామి, నాయకులు గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లేశం గౌడ్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, వర్కల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News