మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం
మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం
స్థానికం బృందం
రామన్నపేట, నిదానపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామన్నపేట యస్ ఐ. నాగరాజుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
బ్రహ్మోత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సహకారం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సిద్ధాంతి బేతోజి సత్యనారాయణ శాస్త్రి, ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, డైరెక్టర్ ఆగు లింగస్వామి, గ్రామ పెద్దలు నారపాక యాదయ్య, గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లయ్య,భాష మల్ల సంతోష్, వర్కాల వినయ్, కడారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి