మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే వేముల వీరేశం
మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే వేముల వీరేశం
స్థానికం బృందం
రామన్నపేట / నిదానపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన మల్లన్న ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, సిద్ధాంతి బేతోజి సత్యనారాయణ శాస్త్రి,ఉత్సవ కమిటీ చైర్మన్ చల్లా నరసింహ, నాయకులు జనుకుల ప్రభాకర్, గుత్తా నర్సిరెడ్డి, మందడి ప్రభాకర్ రెడ్డి, గరిక సత్యనారాయణ, సింగిరెడ్డి మల్లారెడ్డి, గంగుల కృష్ణారెడ్డి,కొండ మల్లయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు లింగస్వామి, కడారి ఐలయ్య, భాష మాల సంతోష్, గొలుసుల ప్రసాద్, కృష్ణ,
వంగల శివకుమార్, సంకు లింగయ్య, కడమంచి స్వామి,చల్ల బిక్షం, చల్ల అశోక్, చల్లా శ్రీశైలం, చల్ల మల్లేశం, బొడిగె రంగయ్య, కడారి మల్లేష్త,తోట కురి ఐలయ్య,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి