మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు
.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి